Site icon Swatantra Tv

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు వ్యక్తులు మృతి

secunderabad

సికింద్రాబాద్‌(secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌ లో గురువారం సాయంత్రం 6:00 గంటల సమయంలో  భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. దట్టమైన పొగతో వీరు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో4 ,5, 6, ఫ్లోర్లలో దట్టమైన మంటలు, దట్టమైన పొగలు చెలరేగడంతో భవనం అంతటా వ్యాపించాయి. మొత్తం ఎనిమిది ఫ్లోర్లు ఉన్న ఈ భవనంలో 4 ,5, ఫ్లోర్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో దాదాపు 25 మంది చిక్కుకుపోయారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కరెంటు ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెపుబుతున్నారు.

Read Also: సొంత తమ్ముడే తనపై విషప్రయోగం చేశాడు.. నటుడు సంచలన వ్యాఖ్యలు

Follow us on:   Youtube   Instagram

Exit mobile version