Site icon Swatantra Tv

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. శంకర్‌రావు దంపతులు మృతి

    ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు శంకర్రావు దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. ఉదయం స్వస్థలం భూపాలపల్లికి మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు చేరుకు న్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరగగా.. 29 మంది మావోయి స్టులు మృతి చెందారు. వారిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్ రజిత ఉన్నారు. అయితే శంకర్రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

Exit mobile version