ఏపీవ్యాప్తంగా యువతలో నైపుణ్య గణన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫైలుపై సంతకం పెట్టిన కొన్నిగంటల్లోనే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో స్కిల్ మ్యాన్ పవర్ అవసరం పెరిగిందని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. నైపుణ్యం కరువవడం వల్ల యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయి. అయితే 80 శాతం వరకూ ఉన్న యువతలోని నైపుణ్యంపై ప్రభుత్వాలకు, పరిశ్రమలకు అవగాహన లేదు. పరిశ్రమల డిమాండు మేరకు యువతలో నైపుణ్యాలు కరువవుతున్నాయని తెలిపింది.
ఏపీ వ్యాప్తంగా యువతలో నైపుణ్య గణన కోసం ప్రభుత్వం ఉత్తర్వులు

