Site icon Swatantra Tv

జనసేన గూటికి భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు

      రాష్ట్రంలో నిజాయితీ పాలనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని… అందుకే ఆయన కు తన మద్దతు ఇస్తున్నానని మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడానికి ర్యాలీగా వెళ్లారు. వైసీపీ అవినీతిని అణచివేయడానికి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని అంజిబాబు అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

Exit mobile version