Site icon Swatantra Tv

శాస్త్రీపురంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident

తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి శాస్త్రీపురంలో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ప్లాసిక్ గోదాంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వెంటనే గోదాం సిబ్బంది అగ్నిమాపక శాఖలు సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. గోదాం అధిక శాతం ప్లాస్టిక్ వస్తువులు ఉండటం వల్ల మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Read Also: ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

Follow us on:   Youtube   Instagram

Exit mobile version