Site icon Swatantra Tv

కోనసీమ జిల్లాలో రేపటి పోలింగ్ కు సర్వం సిద్ధం

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. జిల్లాలో 16 వందల 44 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. వీరి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్‌ బూత్‌ల వద్ద మంచినీరు, ప్రాథ మిక చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో 15,31,410 ఓటర్లు ఉండగా వీరిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 8 వేల 344 మంది, దివ్యాంగ ఓటర్లు 26 వేల 309 మంది ఉన్నారు. నాలుగు అంచెల్లో భద్రాతా ఏర్పాట్లు చేశారు. 13 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 15వేల 600 మంది పోలీసులను నియమించారు.

Exit mobile version