హైదరాబాద్ నగరంలో ఓటింగ్ ఏర్పాట్లను సిద్దం చేశారు అధికారులు. రేపు సాయంత్రానికి ఎన్నికల క్యాంపెయిన్ ముగుస్తుండటంతో అందరూ అధికారులు పోలింగ్ పై ఫోకస్ చేయనున్నారు. డిసెంబర్ ఒకటిన ఉదయం సరిగ్గా ఏడు గంటలకు ఒటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు వరకు సాగుతుంది. జిల్లా పరిధిలో 45 లక్షల 36 వేల 852 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజక వర్గాల్లో ఒటింగ్ నిర్వహించేందుకు అన్ని ఎర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రతి నియోజక వర్గం వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్స్ లతో పాటు పోలింగ్ సామాగ్రిని అందజేస్తారు. పోలింగ్ కేంద్రానికి కేటాయించిన సిబ్బంది అందరూ హాజరు అయిన తరువాత రూట్ల వారీగా బస్సుల్లో వారిని తరలిస్తారు. అందుకోసం 369 రూట్లు ఫైనల్ చేశారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు.
ఇక 15 నియోజకవర్గాల్లో పరిధిలో మొత్తం 4 వేల 119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు… 45 లక్షల 36 వేల 582 మంది పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 23 లక్షల 22వేల 623 మంది పురుషులు.., మహిళలు 22 లక్షల 13 వేల 902 మంది.., ఇతరులు 327 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కేంద్రాలకు వచ్చే వృద్దులకు…, మహిళలకు సహకరించేందుకు వాలంటీర్లను సిద్దం చేస్తున్నారు. వికలాంగులకు కూడా వీరు సహకరించనున్నారు. ఎన్నికల కోసం 20 వేల సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. 4119 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. 1677 లోకేషన్ల లో 4119 పోలింగ్ కేంద్రాలను ఎర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. జిల్లా పరిదిలో మొత్తంగా 79 కోట్ల రూపాయలు సిజ్ చేశామని…, 600 క్రిమినల్ కేసులు బుక్ చేశామన్నారు. సీ విజల్ కు 1136 పిర్యాదులు వచ్చాయన్నారు.
ఇక సిటిలో ఇప్పటికే జిల్లా పరిధిలోని డీఆర్సీ సెంటర్లలో బ్యాలెట్ పెపర్ కమీషనింగ్ పూర్తి చేసిన అధికారులు…, ర్యాండమైజేషన్ చేసిన తరువాత ఎన్నికల అధికారులకు ఈవీఎంలు అందజేయనున్నారు. మొత్తం 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5132 కంట్రోల్ యూనిట్లు…, 9318 బ్యాలెట్ యూనిట్లు.., 5737 వీవీ ప్యాట్లను ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక సిటిలో వివిధ రూపాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్నారు ఎన్నికల అదికారులు. వికలాంగులు…, మహిళలు.., యూత్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికల్లో ఎర్పాటు చేస్తున్నామన్నారు.
ఇక సిటిలో 4119 పోలింగ్ కేంద్రాల్లో 1000 వరకు హైపర్ సెన్సిటివ్.., 500 కేంద్రాలు సెన్సిటివ్ కేంద్రాలు కాగా…, మిగిలిన కేంద్రాలు నార్మల్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. మొత్తం 20 వేల మంది పోలిస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించున్నట్టు చెబుతున్నారు బల్దియా అధికారులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేలా సీసీ టీవీలను ఎర్పాటు చేస్తున్నామన్నారు.