Vishal | కోలీవుడ్ హీరో విశాల్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా సెట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల భారీ ప్రమాదం జరిగింది. చిత్రీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన ట్రక్కు విశాల్తో పాటు అక్కడున్నవారి మీదుకు దూసుకొచ్చింది. ఈ వీడియోను విశాల్(Vishal) ట్వీట్ చేస్తూ… కేవలం కొన్ని సెకన్లలో చావు నుంచి తప్పించుకున్నాను.. ఆ దేవుడికి కృతజ్ఞతలు అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.