స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రముఖ సీరియల్ ‘మహాభారత్’ లో శకుని మామగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుఫీ పైంతాల్ (78) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు వెల్లడించారు. గుఫీ పైంతాల్ అసలు పేరు సరబ్జిత్ సింగ్ పైంతాల్.. నటుడు కావడానికంటే ముందు ఆయన ఆర్మీలో పనిచేశారు. బాలీవుడ్లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు, సీరియల్స్లో ఆయన నటించారు.