స్వతంత్ర వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఆయనకు గాయాలు అయ్యాయి. వెంటనే ఈ ప్రమాదం చూసిన స్థానికులు శర్వానంద్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతున్నారు. రాంగ్ రూట్లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల.. పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం పై శర్వానంద్ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీమ్ తెలిపింది. ఇది చాలా స్వల్ప ఘటన అని.. కారులోని అందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. . కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల.. పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తోన్న శర్వానంద్ తన ప్రియురాలు అయిన రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. జూన్ 3న రాజస్థాన్లో వీరి పెళ్లి జరగనుంది.