Site icon Swatantra Tv

షాద్‌ నగర్‌ అసెంబ్లీ పరిధిలో ఈవీఎంల పంపిణీ

    రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ అసెంబ్లీ పరిధిలో ఈవీఎంల పంపిణీ పూర్తియిందని ఏఆర్వో వెంకట మాధవరావు తెలిపారు. షాద్‌ నగర్‌ అసెంబ్లీ పరిధిలో మొత్తం 268 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 1100మందికి పైగా సిబ్బంది పని చేయనున్నారని చెప్పారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో ఆర్వో, పీఆర్వోతో పాటు మరో ఇద్దరు సిబ్బంది పని చేస్తారన్నారు. ఇప్పటికే పట్టణంలోని మినీ స్టేడియంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఈవీఎంలు అప్పగించామన్నారు. మొత్తం 268 పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలను ఏర్పాటు చేశారన్నారు. భారీ బందోబస్తు నడుమ ఈవీఎంలను సిబ్బందికి అప్పగించామని ఏఆర్వో మాధవ రావు తెలిపారు.

Exit mobile version