తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచార ణ కొనసాగుతోంది. అయితే ఇవాళ్లితో విద్యుత్ కమిషన్ ప్రతక్ష విచారణ ముగియ నుండగాఎంక్వైరీలో భాగంగా విద్యుత్ రంగనిపుణులు వేణుగోపాల్రావు, తిమ్మారెడ్డి కమిషన్ ముందు కురానున్నారు. మరోపక్క ఇప్పటి వరకు హాజరైన వారి స్టేట్మెంట్లపై ఎల్లుండి సమీక్షించనుంది కమి షన్. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ టార్గెట్గా బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గత కేసీఆర్ పాలనలో భారీగా అవి నీతి జరి గిందని ఆరోపిస్తున్నారు. ఇక వీరి వ్యాఖ్యలను ఖండిస్తూ అంతే ధీటుగా గులాబీ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదంటున్నారు. బీఆర్ఎస్ నేతలు. కేవలం రాజకీయ కక్షేనంటూ తిప్పికొడుతున్నారు. కేసీఆర్ వివరణ ఇస్తూ రాసిన లేఖలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే తప్పు చేయనప్పుడు కమిషన్ ముందుకు కేసీఆర్ ఎందుకురావడం లేదని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలా ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగడంతో డైలాగ్ వార్ మరింత ముదురుతోంది.
నేటితో ముగియనున్న విద్యుత్ కమిషన్ ప్రత్యక్ష విచారణ
