స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నేటి కాలంలో భార్యభర్తల మధ్య సఖ్యత అంతగా కానరావడం లేదు. ఏదో ఒక విషయంలో మనస్పర్థలతో గొడవలు పడుతున్నారు. కొంతమంది విడిపోతుంటే.. మరికొంతమంది బరితెగించి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ భార్య తన భర్తపై ప్రేమతో ఎవరూ చేయలేని పనిని చేసింది. హైదరాబాద్ అంబర్ పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితికి వనస్థలిపురానికి చెందిన మనోజ్తో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఆ జంట అమెరికా వెళ్లిపోయి డల్లాస్లో ఉంటున్నారు. ఈనెల 2న తల్లిదండ్రులను చూసేందుకు సాహితి హైదరాబాద్కు వచ్చింది.
అయితే అమెరికాలో ఉన్న ఆమె భర్త మనోజ్ గుండెపోటుతో మరణించాడు. భర్త మరణవార్తను ఆమె తట్టుకోలేకపోయింది. ఈనెల 23న మనోజ్ మృతదేహం నగరానికి రావడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పుట్టింటికి వెళ్లిపోయిన సాహితి రెండురోజులుగా ముభావంగా ఉండడంతో ఆమెకు తోడుగా చెల్లెలు ఉంటుంది. అయితే గురువారం ఉదయం పనిమీద చెల్లెలు బయటకు వెళ్లగానే సాహితి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక సాహితి కూడా బలవన్మరణం చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.