స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రియురాలి పెళ్లి జరుగడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి (మం) రెడ్డివారిపల్లెలో జరిగింది. గత కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్న ఆటో డ్రైవర్ మురళీ.. తన ప్రియురాలికి పెళ్లి జరగటం తట్టుకోలేక.. తను ఇక భూమ్మీద ఉండటం కూడా భారంగా భావించి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువతికి తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ప్రియురాలి పెళ్లి విషయం తెలుసుకుని యువకుడు మురళి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.