Site icon Swatantra Tv

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

     ఒడిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాదుకు అక్రమంగా తరలిస్తున్న ఒకటిన్నర క్వింటాళ్ల గంజాయిని పాల్వంచ పట్టణ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెజీనా స్కూల్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడి నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గుర్ని అరెస్టు చేసారు. నిందితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కు చెందిన మక్కా కృష్ణ, హరియాణాకు చెందిన రాంజీలాల్, పాల్వంచ కు చెందిన మక్కా హరిగా గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాణాల రాము తెలిపారు.

Exit mobile version