Site icon Swatantra Tv

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే- బండి సంజయ్

    కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డపై కాంగ్రెస్ మాట్లాడితే, పాలమూరు-రంగారెడ్డి, కృష్ణా జలాలు అని బీఆర్ఎస్ మాట్లాడుతోం దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిం దని ఇప్పటికే తేలిందని, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకో చెప్పాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదని, ఇక బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

Exit mobile version