తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్ కు నివేదించే అవకాశం ఉంది. కుల గణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు. వీటితో పాటు పీసీసీ కార్యవర్గ విస్తరణ, నామినేటెడ్పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై చర్చించే చాన్స్ ఉంది.
నేడు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్

