Site icon Swatantra Tv

అమెరికాలో మోదీ మద్దతుదార్ల కార్ ర్యాలీ

అమెరికాలో మోదీ మద్దతు దారులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. “ఈ సారి 400 స్థానాలు” , “మూడో సారి మోదీ సర్కార్ ” నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమెరికాలో బీజేపీ మద్దతు దారులు కార్ ర్యాలీ నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో సిక్కు అమెరికన్లు ఈ కార్ ర్యాలీని నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. కార్లపై బీజేపీ జెండా, భారత జెండా, అమెరికా జెండాలను ప్రదర్శించారు. సుమారు 150 కార్లతో ఈ ర్యాలీ జరిగింది. అమెరికా మేరీలాండ్ లోని సిక్కుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

Exit mobile version