స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయమే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు… రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. ఉదయం సెన్సెక్స్ 61,985.36 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,529.83 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 629.07 పాయింట్ల లాభంతో 62,501.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,368.35 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,508.55 దగ్గర గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 178.20 పాయింట్లు లాభపడి 18,499.35 దగ్గర ముగిసింది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు పుంజుకొని 82.58 దగ్గర నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, సన్ఫార్మా, హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, విప్రో, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టైటన్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో పయనించగా… భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.