దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగింపు పలికాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్ 57,566.90 దగ్గర ఫ్లాట్గా మొదలవగా.. ఇంట్రాడేలో 58,019.55 – 57,415.02 మధ్య సూచీ కదలాడింది. చివరకు 126.76 పాయింట్ల లాభంతో 57,653.86 దగ్గర స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 16,984.30 వద్ద మొదలై ఇంట్రాడేలో 17,091- 16,918.55 మధ్య ట్రేడింగ్ జరిపి… చివరకు 40.65 పాయింట్లు లాభపడి 16,985.70 దగ్గర ముగిసింది. ఈరోజు మార్కెట్లు ముగిసే టైంకి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పుంజుకొని 82.37 వద్ద ఉంది. లాభాల బాటలో రిలయన్స్, సన్ఫార్మా, మారుతీ, ఎస్బీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, ఐటీసీ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాల బాటలో పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, నెస్లే ఇండియా షేర్లు ఉన్నాయి.