Stock Market |దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 768.41 పాయింట్లు నష్టపోయి 59,037.78 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 214.10 పాయింట్ల నష్టంతో 17,375.50 దగ్గర ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.05గా ఉంది. లాభాల బాటలో భారతీ ఎయిర్టెల్, టాటా మోటర్స్ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు చవిచూసిన బాటలో సన్ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఐటీసీ, కొటాక్ బ్యాంక్, పవర్గ్రిడ్, ఇన్ఫీ షేర్లు కొనసాగుతున్నాయి.