దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మధ్యతరగతి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవల్ మోడల్ కారు Alto 800 ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. BS6 ఫేజ్2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని భావిస్తోంది. దీంతోపాటు రోడ్డు ట్యాక్స్ పెరగడం, మెటీరియల్ ధర, ఇతర ఖర్చులు పెరగడం ఇందుకు కారణంగా పేర్కొంది. మరో కారణం ఏంటంటే ఆల్టో కె10 మోడల్ కి డిమాండ్ పెరగడం అని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆల్టో800 నిలిపివేత తర్వాత ఆల్టోK10 ఎంట్రీ-లెవల్ మోడల్ కానుంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ 5.94 లక్షల మధ్య ఉంది.
Read Also: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే.. సీఎంగా ఉండి కూడా పోరాటాలు చేశా: KCR
Follow us on: Youtube, Instagram, Google News