Site icon Swatantra Tv

కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం

      సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్ తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముదిరాజ్ బస్తీ, యాదవ్ బస్తీ, అంజనమ్మ కాలనీ, దోభీ కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. సాయన్న కుమార్తెగా ఆయన పేరును నిలబెడతానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలను గురించి నివేదిత వివరించారు.

 

 

Exit mobile version