Site icon Swatantra Tv

బీజేపీ వచ్చేది 150 సీట్లు మాత్రమే – రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేనని రాహుల్ అన్నారు. 15 నుంచి 20 రోజుల క్రితం బీజేపీ లోకసభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నానని, కానీ, బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకి పడిపోతుందని చెప్పారు. తమకు అనన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో చాలా బలమైన కూటమి ఉందని, తమకు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసినవారికి అప్రెంటిస్‌షిప్ హక్కును కల్పిస్తామని రాహుల్ అన్నారు. యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తామన్నారు.

Exit mobile version