Site icon Swatantra Tv

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్

      సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ను చూడ కుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి? అంటూ నిప్పులు చెరిగారు. ఒక ఆడ బిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా, రాబందుల గా నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అరుణ ఫైర్ అయ్యారు.

Exit mobile version