Site icon Swatantra Tv

ఐపీఎల్‌లో నేడు బెంగళూరు వర్సెస్ గుజరాత్

     ఐపీఎల్‌లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్‌ పోటీ పడబోతుంది. బెంగు ళూరులోని చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఆర్సీబీ తమ చివరి రెండు మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా మళ్లీ విజయాలను నమోదు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. గుజరాత్‌ 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉండగా.. ఆర్సీబీ మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, 7 ఓడిపోయి చివరి స్థానంలో ఉంది.

Exit mobile version