Site icon Swatantra Tv

నేటి నుంచి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర

    సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ్టి నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారు. ఇందుకోసం బాలయ్య అన్‌స్టాపబుల్‌ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును రూపొందించారు. ఇవాళ ఉదయం కదిరి లక్ష్మి నరసింహ స్వామి, దర్గా సందర్శన అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. కదిరి, కొత్త్తచెరువు, శింగనమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. మొదట కదిరిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు లో ఏర్పాటు చేసిన స్థానిక నాయకుల సమావేశంలో పాల్గొని రాత్రికి శింగనమలలో బస చేస్తారు.

   రేపు ఉదయం శింగనమల నియోజకవర్గం కల్లూరులో ఏర్పాటు చేసిన సభలో బాలకృష్ణ పాల్గొంటారు. అనంతపురం అర్బన్‌ లో ఏర్పాటు చేసిన టీడీపీ నేతల సమావేశంలో పాల్గొంటారు . రాత్రికి తాడిపత్రి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బాలకృష్ణ. ఏప్రిల్‌ 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో ప్రచారం నిర్వహిస్తారు.

Exit mobile version