ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం జగన్ మరో దొంగ నాటకానికి తెర తీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అమరావతి రాజధాని కోసం 33వేల ఎకరాలు భూమినిచ్చిన రైతులను నట్టేట ముంచారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్ నోరు మెదపడంలేద న్నారు. కర్నూల్లో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారన్నారు. విశాఖలో భూ కబ్జాలు, దందాలు కొనసాగుతున్నా వాటిపై ఎలంటి చర్చలు తీసుకోలేదన్నారు సీపీఐ రామకృష్ణ.
ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం జగన్ మరో నాటకం
![](https://swatantralive.com/wp-content/uploads/2024/03/cpi-1.jpg)