ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి రేషన్ సరాఫరా కోసం వినియోగిస్తున్న MDU వాహన యజమానులకు కూడా.. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపజేస్తుందని ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం సొంతవాహనం ఉండి అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు జగన్ సర్కారు ఏటా రూ.10వేల చొప్పున ఇస్తుంది. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ఎండియు డ్రైవర్ల అకౌంట్ లో కూడా జమ చేయనుంది. దీంతో వేలాది మందికి కొత్తగా లబ్ది చేకూరనుంది.
సంక్షేమ పథకాలకు నిధులకు సర్దుబాటు చేయడం వల్ల… గతంలో జీతాల చెల్లింపుకు ఆలస్యమైందని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఉద్యోగుల మద్దతు ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు వచ్చే నెల ఒకటినే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో జీతాల చెల్లింపులు ఆలస్యం కావడానికి కొందరు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని అన్నారు.