YS Jagan | ఏపీలో రాజకీయ యుద్ధం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నాలుగవ విడత విడుదల చేసిన జగన్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదల పార్టీ, పెత్తందారుల పార్టీ మధ్య యుద్దం జరగబోతోందన్నారు. చంద్రబాబుది పెత్తందారుల పార్టీ అయితే.. వైసీపీది రైతన్నల పార్టీ అని తెలిపారు. రైతన్నలను వంచించిన చంద్రబాబు(Chandrababu) ఓవైపు.. రైత్నలకు అండగా ఉన్న పార్టీ వైసీపీ అని జగన్ వెల్లడించారు. చంద్రబాబు, దత్తపుత్రుడుది దోచుకో.. పంచుకో.. తినుకో నైజం అని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్దం కాదని.. క్లాస్ వార్ అని జగన్(YS Jagan) పేర్కొన్నారు. తమ ఇంట్లో మంచి జరిగిందో.. లేదో అన్నది ప్రామాణికంగా తీసుకుని ప్రజలు వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాని విజ్ఞప్తి చేశారు.