ఆంధ్రప్రదేశ్: నేటి నుండి శ్రీశైలంలో 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్న ఆలయ అధికారాలు తెలియజేశారు. నేడు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆది దంపతులు బృంగివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్నారు. ఉగాది వేడుకలకు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.