39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు

మంగళగిరి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లోకి చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరిపోయారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్యెల్యే ఈదర హరిబాబులకు అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు భీమిలికి చెందిన వైసీపీ నేతలు శ్రీచంద్రరావు, దివాకర్ తదితరులు కూడా జనసేన కండువా కప్పున్నారు. కాగా టీవీ రామారావు 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014,2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు. వైసీపీలో గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. ఇక ఈదర హరిబాబు 1994లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో జడ్పీ చైర్మన్ గానూ విధుల నిర్వర్తించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న హరిబాబు.. ఇప్పుడు జనసేనలో చేరడం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Latest Articles

ఎన్నికల వేళ జనసేనకు మరో షాక్

     ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడి వేరేపార్టీలోకి వలస వెళుతున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్