స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నిడమానూరు వద్ద బైక్ పై వెళుతున్న ముగ్గురినిఅశోక్ లేలాండ్ వెహికల్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. మృతులు కొత్తపట్నం మండలం ఈతమొక్కలకు చెందిన బిందెల కోటిరత్నం, బిందెల ప్రవీణ్ కుమార్, మేళం దిలీపు కుమార్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్ పరారీ అయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.