Bhumireddy Ramagopal Reddy | సీఎం జగన్(Jagan) డిగ్రీ పూర్తిచేశారా? లేదా? ప్రజలకు చెప్పాలని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ డిగ్రీ పూర్తి చేసి ఉంటే పులివెందులలో ఎమ్మెల్సీ ఓటరుగా ఎందుకు నమోదుచేసుకోలేదని ప్రశ్నించారు. సాధారణ ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్న జగన్.. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఓటరుగా తన పేరు ఓటర్ లిస్టులో ఎందుకు లేదని అడిగారు. ఓటు లేని వ్యక్తి తమ అభ్యర్థులకు ఓటు వేయాలని ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు శాసనమండలి వద్దు.. రద్దు చేసిన వ్యక్తి అభ్యర్థులను మండలి ఎన్నికల బరిలో నిలబెట్టడం విడ్డూరంగా ఉందని రామగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read Also: RGV కి.. BRS కార్పొరేటర్ స్ట్రాంగ్ వార్నింగ్