35.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు వేగంగా జరగడం లేదని.. దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. హత్యకు గల కారణాలు, ఉద్దేశాలను బయటపెట్టాలని సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారిని మార్చండి.. లేదంటే మరో అధికారిని నియమించండి.. అవసరమైతే ప్రస్తుతం ఉన్న అధికారినే కొనసాగించండి.. ఏదైనా కానీ దర్యాప్తు వేగంగా పూర్తి చేయండని ఆదేశించింది. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక మొత్తం చదివామని.. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతోనే జరిగిందని నివేదికలో రాశారని పేర్కొంది. సీబీఐ డైరక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్