ఆంధ్రప్రదేశ్ : కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సు పార్వతీపురం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ఉన్నారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.