39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే వస్తాయి: పవన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి అభినందనలు తెలిపారు పవన్.

Latest Articles

టీడీపీ తుది జాబితా విడుదుల ….. చెలరేగిన అసమ్మతి

    ఏపీలో ఎన్నికల జాతర మహా రంజుగా సాగుతోంది. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమి ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. రేసు గుర్రాల ఎంపికలో ఆచితూచి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్