27.7 C
Hyderabad
Monday, May 29, 2023

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే వస్తాయి: పవన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి అభినందనలు తెలిపారు పవన్.

Latest Articles

నేటి 12 రాశుల శుభ, అశుభ ఫలితాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశిఫలాలు చెబుతుంటారు. అనేక విషయాలను ప్రామాణికంగా తీసుకొని మే 29, సోమవారం నాటి రాశిఫలాలను అంచనా వేశారు. జ్యోతిష్యం ప్రకారం,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్