Nara Lokesh Padayatra |టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) నియోజకవర్గం పుంగనూరులో యాత్ర చేస్తున్న లోకేశ్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గం కావడంతో పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో సీఎం జగన్(Jagan) తర్వాత అంతా తానే అని పెద్దిరెడ్డి ముద్రవేసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడు జైలుకు వెళ్తారా.. సీఎం సీట్లో ఎప్పుడు కూర్చుందామా అని పెద్దిరెడ్డి ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయల అవినీతికి మంత్రి పాల్పడ్డారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి దోచుకున్నదంతా కక్కిస్తానని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.