స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్రెడ్డికి సీబీఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. సునీతారెడ్డి, సీబీఐ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కేసులో మెరిట్స్ ఆధారంగా ఈ మేరకు తీర్పు వెల్లడించింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ వాదనలు ఉన్న న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా సీబీఐ అధికారులు ఏప్రిల్ 16న భాస్కర్రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. భాస్కర్రెడ్డి అరెస్టుకు రెండు రోజుల ముందే ఎంపీ అవినాష్రెడ్డి ప్రధాన అనుచరుడు గుజ్జల ఉదయ్కుమార్రెడ్డిని అరెస్టు చేశారు.