స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ లో రుతుపవనాల ప్రవేశంపై భారత వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది. జూన్ 4న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే నమోదవుతుందని వివరించింది. శుక్రవారం వాతావరణ వివరాలను వెల్లడించిన ఐఎండీ.. జూన్ 1వ తారీఖున దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాము భావించట్లేదని వివరించింది. వాయువ్య భారతదేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఉత్తరాదిన రుతుపవనాలకు ముందుగానే వర్షాలు పడడానికి గల కారణం పాశ్చాత్య దేశాల్లో వాతవరణ అసమతుల్యతే అని వివరించింది.