స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కడపకు చెందిన విశ్వనాథ్ రెడ్డి 2 రోజుల క్రితం ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంట్లో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.