స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ అగ్రనేత నారా లోకేష్ పై సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. సజ్జల వ్యాఖ్యల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తుందని అన్నారు. సజ్జల లాంటి బాడుగ నేతల బతుకుల లెక్కలు అన్ని తేలుస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించిన నీతిమాలిన నాయకత్వాన పని చేస్తూ పుట్టుకల గురించి మీరు మాట్లాడితే జనం హర్షించరని ఫైర్ అయ్యారు. సైకో ఎవరో.. ఎవరు మనస్తత్వ వైకల్యంతో బాధపడుతున్నారో.. ఎవరి పుట్టుక రాష్ట్రానికి.. సొంత కుటుంబానికి శాపంలా మారిందో.. యావత్తు రాష్ట్రానికి తెలుసని అన్నారు. క్రిమినల్ కోసం క్రిమినల్ పనులు చేస్తున్న మీరూ రేపు మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు. వైసీపీపై మండిపడుతూ.. మీ భవిష్యత్ దుర్బరంగా ఉండబోతుందని.. మీ అహంకారం కుప్ప కూలుతుందని అన్నారు. అప్పుడు మీ లాంటి బాడుగ నేతల బతుకుల లెక్క తేలుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.