ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజకీయం చేయండి. అంతేగాని గాలోల్ల చేత బూతులు తిట్టించి రాజకీయాలు చేయవద్దు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి ఓ రిటైర్డ్ ఐఏఎస్ ను ఢిల్లీ నుండి తీసుకువచ్చి కొడతారా? అని ప్రశ్నించారు. సీనియర్ మాజీ ఐఏఎస్ శ్రీకాంత్ ను ప్రభుత్వం వేధిస్తుందని…పోలీసు వ్యవస్థను దిగ జార్చి కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నేను మంత్రి గా ఐదుగురు ముఖ్య మంత్రుల వద్ద 14 ఏళ్లు పని చేశాను. సీఐడీని అడ్డం పెట్టి అధికారులను వేధించే ఇలాంటి సీఎంని నేను ఎక్కడ చూడలేదు. సీఎం జగన్ చేస్తున్న అరాచకం వెంటనే ఆపాలని మండిపడ్డారు.
Read Also: 500 కిలోమీటర్ల మైలురాయిని దాటిన లోకేష్ పాదయాత్ర
Follow us on: Youtube Instagram