స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రములోని విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. రేపు జగనన్న విద్యా దీవెన.. జనవరి – మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యాదీవెనతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్లను జమ చేయనున్నారు.