G. V. L. Narasimha Rao | స్టీల్ ప్లాంట్ సమస్యలు, సవాళ్ళపై సిఎండి అతుల్ భట్ తో చర్చించానని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు అన్నారు. స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు కోసం ఈఒఐ ఎక్ష్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు స్టీల్ ప్లాంట్ ను కొనేస్తున్నట్టు ప్రాచారం చెయ్యడం… వట్టి అవివేకం అని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారాలు చేసి కార్మికులను, ప్రజలను అపోహలో నెడుతున్నారని.. ఇప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తిలేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎస్బిఐ నుంచి వర్కింగ్ కేపిటల్ వచ్చేలా కృషిచేసినట్లు తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే ఫైనాన్స్, స్టీల్ కార్యదర్శి లతో పలుమార్లు చర్చించానని అన్నారు. స్టీల్ ప్లాంట్ ని లాబాల్లోకి తేవాలంటే ఏమి చెయ్యాలి? అనే అంశంపై సీఎండీతో చర్చించినట్లు జివిఎల్ వెల్లడించారు.