CM Jagan visit| ప్రతిష్టాత్మక జీ 20 సన్నాహక సదస్సుకు వెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకి ఎదురైంది. గన్నవరం నుండి సదస్సుకు బయలుదేరనున్న విమానానికి సాంకేతికలోపం తలెత్తడంతో ప్రయాణం ఆగిపోయింది. దీంతో జగన్ పర్యటనకు అడ్డంకి ఎదురైంది. ప్రతిష్టాత్మక జీ 20 సన్నాహక సమావేశాలు విశాఖలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ వన్ ఫ్యామిలీ, వన్ ఎర్త్, వన్ ఫ్యూచర్ అనే థీమ్తో కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం.