స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా క్రోసూరులో ఈ నెల 12న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి క్రోసూరు చేరుకుంటారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.