స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఆర్డీజీ నిధులు పదివేల కోట్లకు పైగా కేంద్రం విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి నిర్మలను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేయన్నారు. వీటితో పాటుగా మరికొన్ని అంశాలపై సీఎం చర్చించనున్నారు. కాగా, సీఎం, నిర్మలా భేటీ రాష్ట్రరాజకీయాల్లో చర్చనీయాంగా మారింది.