30.2 C
Hyderabad
Thursday, June 8, 2023

మచిలీపట్నానికి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశాడు: సీఎం జగన్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్ట్ కు శతాబ్దాల చరిత్ర ఉందని అన్నారు. రూ.5,156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ పెరిగేకొద్దీ బెర్తులను పెంచి 116 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యం పెంచే అవకాశం ఉందని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడుతూ.. మచిలీపట్నానికి బాబు తీవ్ర ద్రోహం చేశాడని అన్నారు. ఇక పోర్టు గ్రహణాలన్నీ తొలగిపోయాయి..అడుగులు వేగంగా పడతాయి.. మచిలీపట్నం రూపు రేఖలు మారుతున్నాయని సీఎం వెల్లడించారు. గతంలో బందరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కలెక్టర్ తో సహా ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు.. వారంలో ఒకరోజు వస్తే అదే పదివేలు అన్నట్లు పరిస్థితి ఉండేది.. ఇప్పుడు కలెక్టర్ తో సహా మొత్తం యంత్రాంగం ఇక్కడే ఉంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

 

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్